కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

77பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాదులోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు బోథ్ నియోజకవర్గ నాయకులు వన్నెల అశోక్ సైతం బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

தொடர்புடைய செய்தி