చేపల లోడు లారీ బోల్తా.. లైవ్‌ ఫిష్‌ కోసం ఎగబడిన జనం

561பார்த்தது
చేపల లోడు లారీ బోల్తా.. లైవ్‌ ఫిష్‌ కోసం ఎగబడిన జనం
తెలంగాణలో మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అయితే, లారీ బోల్తా పడడంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. దీంతో బతికున్న చేపల (లైవ్‌ ఫిష్‌) కోసం ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలో వైరల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி