బావిలోని నీళ్లు తాగి 50 మందికి అస్వస్థత

71பார்த்தது
బావిలోని నీళ్లు తాగి 50 మందికి అస్వస్థత
TG: బావిలోని నీటిని తాగి 50 మంది అస్వస్థతకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సంజీవరావుపేట్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన BC కాలనీ వాసులు స్థానికంగా ఉండే బావి నీటిని తాగారు. నీళ్లు తాగిన కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. స్పందించిన స్థానికులు బాధితులను నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி