Mar 16, 2025, 15:03 IST/
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. లారీని ఢీకొన్న బస్సు
Mar 16, 2025, 15:03 IST
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ సమీపంలో ఉప్పుటేరు వాగు దగ్గర ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.