టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్ను అరెస్ట్ చేయాలన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణను అరెస్ట్ చేయాలన్నారు. గత టీటీడీ బోర్డు సభ్యులను విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.