వైసీపీ హయాంలో పర్యాటక శాఖ నిర్వీర్యం: మంత్రి కందుల దుర్గేశ్

79பார்த்தது
వైసీపీ హయాంలో పర్యాటక శాఖ నిర్వీర్యం: మంత్రి కందుల దుర్గేశ్
వైసీపీ హయాంలో పర్యాటక శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో చాలా టూరిజం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయన్నారు. దాని వల్ల భారీ ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖలో యాత్రి నివాస్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. విశాఖ తీరంలో ఎంవీ ఎంఏఏ షిప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி