ఆ పాపం జగన్‌దే: మంత్రి రవి కుమార్

53பார்த்தது
ఆ పాపం జగన్‌దే: మంత్రి రవి కుమార్
AP: వైసీపీ అధినేత జగన్‌పై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలే ఇప్పుడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడుతోందన్నారు. ఏపీ జెన్‌కోను నిర్వీర్యం చేసి.. యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி