APSRTC ఉద్యోగులకు రూ.25 వేల రుణం!

72பார்த்தது
APSRTC ఉద్యోగులకు రూ.25 వేల రుణం!
ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, సహకార సంఘం సభ్యులకు రూ.25 వేల వరద రుణం మంజూరు చేయాలని ఆ సంఘం నిర్ణయించింది. వరదలతో పూర్తిగా నష్టపోయిన వారికి ఈ రుణం అందిస్తామని ప్రకటించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని డిపోలు, విజయవాడలోని నాన్ ఆపరేషన్ యూనిట్లు, ఎండీ కార్యాలయంలో పని చేసే ఆర్టీసీ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఆ సంఘం కార్యదర్శి తెలిపారు. రుణం కావాల్సిన వారు సంబంధిత డిపో, యూనిట్ మేనేజర్‌ను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி