కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం

57பார்த்தது
కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం
కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకతీయ విద్యా సంస్థల కరస్పాండెంట్ డైరెక్టర్ దీవి లలిత బాబు, ప్రిన్సిపల్ ఏ. అశోక్ అన్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సౌజన్యంతో జనచైతన్య సమితి ఆధ్వర్యంలో పెదకూరపాడు లోని కాకతీయ  కళాశాల విద్యార్థులకు శుక్రవారం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. జన చైతన్య సమితి కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్, దాసరి విజయబెన్నిబాబు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி