ఆదుకోవాలంటూ డిప్యూటీ సీఎంకు వినతి

62பார்த்தது
ఆదుకోవాలంటూ డిప్యూటీ సీఎంకు వినతి
విజయవాడ 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన 300 ఇళ్లు ఇటీవల వచ్చిన వరద కారణంగా నీటమునిగాయని నసీమా అనే యువతి డిప్యూటీ సీఎం పవన్ వద్ద వాపోయారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ కు ఆమె వినతి పత్రం అందజేశారు. ఆమెతోపాటు ఆ ప్రాంతానికి చెందిన నగీనా, విజయ, భవాని, సుధారాణి తదితరులు తామెలా నష్టపోయిందీ వివరించి తమకు న్యాయం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி