ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తాం: వెంకటేశ్వర్లు

65பார்த்தது
కాకుమాను మండలం కొల్లిమర్ల , కేబీపాలెం గ్రామాలలో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, పొన్నూరు ఏడిఏ రామకోటేశ్వరి వరి పంట పొలాలను పరిశీలించారు. రైతులతో ఆయన మాట్లాడుతూ.. వరి పంట 4 నుండి 5 రోజుల వరకు తట్టుకోగలదన్నారు. పొలంలో నీటిని తీసివేసి స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు పంటలు రక్షించుకోవాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు తప్పని సరిగా ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி