ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది: గాదె

60பார்த்தது
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామంలో.. గురువారం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆ పార్టీ నాయకులు రైతులతో కలిసి వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. వ్యవసాయ సిబ్బందిని పంట నష్టం అంచనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி