పెదనందిపాడులో మరియమ్మతల్లి విగ్రహంకంటి నుంచి ఎర్రటి ద్రవం..

54பார்த்தது
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గo పెదనందిపాడు మండలం కట్రపాడు గ్రామంలో పునీత్ సౌరి దేవాలయంలో శుక్రవారం మరియమ్మ తల్లి విగ్రహం కంటి వెంట ఎర్రటి రంగు కారుతుంది. ఈ దృశ్యం కనిపించడంతో గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల నుండి మరియమ్మ తల్లి భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇలా జరగటం ఆశ్చర్యంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. భక్తులు ఈ దృశ్యం చూసేందుకు తoడోపతండాలుగా ఆలయానికి వస్తున్నారు.

தொடர்புடைய செய்தி