మాజీ సీఎం జగన్ గుంటూరు బయలుదేరారు. గుంటూరులోని మిర్చి యార్డును పరిశీలించి మిర్చి రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు. అయితే జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి లేదని ఇది వరకే అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో మిర్చి యార్డు వద్ద ఇప్పటికే పోలీసులు భారీగా చేరుకున్నారు.