విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు మృతి

81பார்த்தது
విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు మృతి
భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మూడు పాడి గేదెలు విద్యుత్ షాక్ కు గురై శనివారం మరణించాయి. రైతు ఆకుల మల్లారెడ్డికి చెందిన గేదెలు మేత కోసం తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా బొల్లెపల్లి శివారులో ఉన్న రామడుబావిలో కరెంటు తీగలు తెగి ఉండడంతో గేదెలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி