లోక్సభ 5వ దశ పోలింగ్లో యూపీలోని ఫైజాబాద్ ఎంపీ స్థానంలో అయోధ్య ఉండడంతో అందరిలో ఇక్కడ గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రామమందిరం ప్రభావంతో మరోసారి గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది. అయితే ఇక్కడ దళిత ఓటర్లది (26%) కీలక పాత్ర. BJP ఎంపీ లల్లూ సింగ్కు పోటీగా అవధేశ్ ప్రసాద్ను సమాజ్వాదీ పార్టీ బరిలోకి దింపింది. దళిత నేతగా ఈయనకు ముస్లిం, యాదవ వర్గాల మద్దతు ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.