మాతృ పితృ పూజోత్సవ కార్యక్రమం

63பார்த்தது
హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో శంభునిపేట కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో నిర్వహిస్తున్న బాల సంస్కార శిబిరంలో భాగంగా ఆదివారం మాతృ పితృ పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలబాలికలు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. యోగా గురువు అశోక్ మాట్లాడుతూ తల్లిదండ్రులను నిత్యం ఆరాధించాలని, వారికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దయాకర్, రవిబాబు, శ్రీరామ్, రమేష్, శరత్ బాబు, వినయ్, రాహుల్, కిరణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி