40 ఫీట్ల గణేష్ కి ఉన్న చోటే నిమజ్జనం

564பார்த்தது
వరంగల్ ఎల్లంబజార్లో ఏర్పాటు చేసిన 40 ఫీట్ల మట్టి గణపతి నిమజ్జనోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే 15వ రోజు నిమజ్జనం చేశారు. భక్తులు రెండు ట్యాంకర్ల నిండా నీళ్లు తెప్పించి. గణపతి విగ్రహంపై చల్లుతూ నిమజ్జనం చేశారు. వేలాదిగా నగర ప్రజలు తరలి వచ్చి వినాయకున్ని దర్శించుకున్నారు. బైబై గణేశా.. గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி