మంగళవారం ఖిలా వరంగల్ తూర్చుకోటకు చెందిన బోడ వెంకన్న దూపకుంటరోడ్డులోని తన పంట పొలంలో పనులు చేసుకుంటుండగా. గతంలో జరిగిన శుభకార్యానికి తనను ఎందుకు పిలవలేదంటూ హరీష్ అనే వ్యక్తి గొడవపడి కర్రతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హరీష్ పై కేసు నమోదు చేసినట్లు వరంగల్ మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు.