విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

63பார்த்தது
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం పటేల్ గూడెంలో విద్యుత్ షాక్ తో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం గట్టమల్ల కరుణాకర్ డిగ్రీ చదువుతూ భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. శుక్రవారం పనులకు వెళ్లిన కరుణాకర్ వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి కాళ్లు కడుక్కుంటుండగా విద్యుత్ తీగ తగిలి షాక్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி