పరకాల క్లస్టర్ లోని రైతులు విత్తనాలు కొనేటప్పుడు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలను పాటించాలి అని ఏఈఓ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైతులు విత్తనాలను తీసుకొనే సమయంలో రశిదు, బిల్లులు, తేదీ ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. అదేవిదంగా జీలుగలు, పచ్చిరొట్టె, ఎరువులు జనుములు, పిల్లి పెసరలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.