మల్లూరులో ఇసుక లారీలను అడ్డుకున్న మహిళలు

60பார்த்தது
మల్లూరులో ఇసుక లారీలను అడ్డుకున్న మహిళలు
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో ఇసుక లారీలను సోమవారం గిరిజనేతర మహిళలు అడ్డుకున్నారు. మల్లూరులో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలో గిరిజనులతో పాటు తమకు ఉపాధి కల్పించాలన్నారు. సరైన హామీ ఇచ్చేదాకా లారీలను కదలనివ్వమని ఆందోళన చేపట్టారు. క్వారీ ద్వారా వచ్చే ఆదాయంలో తమకు కూడా హక్కు కల్పించాలన్నారు. విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు.

தொடர்புடைய செய்தி