ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారు వెండి ఆభరణాల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు, ఎండోమెంట్ అధికారులు స్వామివారిని వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాగా, రేపు జరగబోయే స్వామివారి తీరు కళ్యణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.