క్రీడా మైదానమా... పశువుల కొట్టమా..!

53பார்த்தது
గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా మైదానాలు నిరుపయోగంగా మారాయి. ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామంలో ఏర్పాటుచేసిన క్రీడా మైదానం పశువుల కొట్టంగా మారింది. వందల సంఖ్యలో పశువులను క్రీడామైదానంలోని ఆట వస్తువులకు కట్టేయడం గమనార్హం. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే క్రీడా మైదానాలు అస్తవ్యస్తంగా మారాయని ఆదివారం స్థానికులు ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி