ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన ఎంపీటీసీ పెనక వెంకన్నపై దాడి జరిగింది. బుధవారం రాత్రి కర్లాయిలోని తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి జరిగినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన ఎంపిటిసి పెనక వెంకన్నను హుటాహుటిన వరంగల్ లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లు గురువారం గ్రామస్తులు తెలిపారు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగి ఉంటుందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.