మండల స్థాయి చెకుముఖి పోటీల నిర్వహణ

84பார்த்தது
మండల స్థాయి చెకుముఖి పోటీల నిర్వహణ
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మండల స్థాయి చెకుముకి పోటీలు అయినవోలు మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక మండల కన్వీనర్ సోమయ్య ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో మండలంలోని ప్రతి పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ విభాగంలో వెంకటాపురం జడ్పీహెచ్ ఎస్ విద్యార్థులు ఎంపికయ్యారు. తెలుగు విభాగంలో కక్కిరాలపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రైవేటు పాఠశాల నుండి పాత్ ఫైండర్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన ఈ మూడు పాఠశాలల విద్యార్థులు స్పెక్ట్రా హైస్కూల్లో 15వ తారీకు జరిగేటువంటి జిల్లా స్థాయి పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నందనం హెచ్ఎం సత్యనారాయణ, అయినవోలు హెచ్ఎం ఎల్లయ్య, శ్రీనివాస్, సందీప్, ప్రసాద్, అశోక్, విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி