పాఠశాలలో చేపట్టిన త్రాగునీటి వసతుల పనులను అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జనగామ మండలం పెంబర్తిలోని పాఠశాలలో త్రాగునీటి కోసం నిర్మిస్తున్న పనులను శుక్రవారం పరిశీలించినట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కొరకు చేపడుతున్న పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు.