రుణమాఫీ సందర్భంగా రైతుల విజయోత్సవ ర్యాలీ

65பார்த்தது
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఎడ్లబండ్లతో సహా రైతులు అధిక సంఖ్యలో ఈర్యాలీలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దూర్, దూలిమిట్ట, కొమురవెల్లి, చేర్యాల మండలాల నుండి రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி