డోర్నకల్ లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

66பார்த்தது
మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఎంపీగా గెలుపొందిన సందర్భంగా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు జగదీష్, గ్రామ అధ్యక్షులు రామకృష్ణ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி