భూపాలపల్లి: ప్రతి ఒక్కరికి మధుమేహ, బీపి పరీక్షలు నిర్వహించాలి

77பார்த்தது
30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మధుమేహా, బిపి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం సాయంత్రం ఐడిఓసి లో ఆరోగ్య కార్యకలాపాలపై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోషకాహారలోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని అంగన్వాడి కేంద్రాలలో చేర్చాలని తెలిపారు. అలాంటి చిన్నారుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా తయారు చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி