భూపాలపల్లి: బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం

56பார்த்தது
బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన ఉదంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో చోటుచేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలిక ఒంటరిగా ఉండగా రత్నం రామయ్య అనే 71 ఏళ్ల వృద్ధుడు ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி