మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా జవహర్లోని ప్రసిద్ధ దభోసా జలపాతం వద్ద ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. పర్యాటకుల అత్యుత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇద్దరు పర్యాటకులు 120 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి దూకారు. మేజ్ షేక్ అనే పర్యాటకుడు చనిపోయాడు. మరో పర్యాటకుడు జోఫ్ షేక్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.