తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి

68பார்த்தது
తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తూత్తుకుడిలోని ఓ ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో నిన్న సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముత్తుకన్నన్(21), విజయ్(25) అనే ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురు సెల్వం(21), ప్రశాంత్(20), సెంధూర్కాని(45), ముత్తుమారి(41)కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ స్పందించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.3లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.1లక్ష చొప్పున సాయం అందిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி