తిరుమలలో మరోసారి చిరుతల కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతల సంచరించడాన్ని భక్తులు గుర్తించారు. భక్తులు భయంతో బిగ్గరగా కేకలు పెట్టడంతో అడవిలోకి చిరుతలు పారిపోయాయి. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.