SLBC టన్నెల్లోని మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. 'టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆకస్మాత్తుగా సొరంగంలో మట్టి, నీరు చేరడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. NDRF, డిజాస్టర్ మెనేజ్మెంట్ సైనిక బృందాల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీసే పరిస్థితి లేదు' అని చెప్పారు.