విజయనగరం జిల్లా అప్పనవలసలో దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు బంగారం వర్కర్లు బైక్పై బంగారం తీసుకెళ్తుండగా దోపిడీ దొంగలు దాడి చేశారు. ఈ మేరకు తమ కళ్లల్లో కారం చల్లి, రాడ్డుతో దాడి చేసి, అనంతరం తుపాకీతో కాల్పులు జరిపినట్లు బాధితులు తెలిపారు. దుండగుల కాల్పులు జర
పడంతో తమ వద్ద ఉన్న 50 గ్రాముల బంగారాన్ని చెట్లల్లో విసిరేసినట్లు చెప్పారు. అనంతరం సెల్ ఫోన్ లు, నగదు లాక్కొని దొంగలు పరారైనట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.