బైక్ పై వెళ్తున్న బంగారం వర్కర్ల కళ్లలో కారం చల్లి, కాల్పులు జరిపిన దుండగులు

1080பார்த்தது
బైక్ పై వెళ్తున్న బంగారం వర్కర్ల కళ్లలో కారం చల్లి, కాల్పులు జరిపిన దుండగులు
విజయనగరం జిల్లా అప్పనవలసలో దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు బంగారం వర్కర్లు బైక్‌పై బంగారం తీసుకెళ్తుండగా దోపిడీ దొంగలు దాడి చేశారు. ఈ మేరకు తమ కళ్లల్లో కారం చల్లి, రాడ్డుతో దాడి చేసి, అనంతరం తుపాకీతో కాల్పులు జరిపినట్లు బాధితులు తెలిపారు. దుండగుల కాల్పులు జరపడంతో తమ వద్ద ఉన్న 50 గ్రాముల బంగారాన్ని చెట్లల్లో విసిరేసినట్లు చెప్పారు. అనంతరం సెల్ ఫోన్ లు, నగదు లాక్కొని దొంగలు పరారైనట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி