రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

580பார்த்தது
రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట మాజీ ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆమె ప్రమాదంలో మృతి చెందారు. లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సంతాపం అనంతరం అసెంబ్లీని వాయిదా వేయనున్నారు. అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ కానుంది.

தொடர்புடைய செய்தி