వరదల కారణంగా దెబ్బ తిన్న పాఠశాలను పరిశీలించిన ఎమ్మార్వో

82பார்த்தது
వరదల కారణంగా దెబ్బ తిన్న పాఠశాలను పరిశీలించిన ఎమ్మార్వో
వరదల కారణంగా పాఠశాలలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని అనంతగిరి మండల రెవెన్యూ అధికారి హిమబిందు అన్నారు. బుధవారం వరద తాకిడికి గురైన రంగాపురం ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మంచి నీటి ట్యాంకు, మరుగు దొడ్లు వరద తాకిడికి కొట్టుకుపోయాయని ప్రధానోపాధ్యాయులు ఏడుకొండలు తహసీల్దార్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శి ఉన్నారు.

தொடர்புடைய செய்தி