అన్నదానాలు పుణ్యకార్యాలు : ఎస్ఐ ప్రవీణ్ కుమార్

71பார்த்தது
అన్నదానాలు పుణ్యకార్యాలు : ఎస్ఐ ప్రవీణ్ కుమార్
గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నదానాలు పుణ్యకార్యాలు అన్నారు. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. విగ్నేశ్వరుని కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సైదులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி