దేవరగట్టులో 250 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్ఠ నిఘా

66பார்த்தது
దేవరగట్టులో 250 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్ఠ నిఘా
దేవరగట్టులో శనివారం కర్రల సమరం జరగనుంది. ఈ బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పోలీసులు నాలుగు చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. 250 సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవంలో గాయపడే వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా సుమారు 30 నుంచి 50 మంచాలతో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி