SLBC టన్నెల్ ప్రమాద ఘటనాస్థలికి ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు మూడు హెలికాప్టర్లలో ఆర్మీ, డిఫెన్స్ టీంలు సహాయక చర్యలు ముమ్మరం చేయనున్నాయి. ఆధునిక టెక్నాలజీతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు మంత్రులు, అధికారులు వరుస సమీక్షలు చేపట్టారు. సహాయక చర్యలకు అవసరమైన సామాగ్రిని NDRF సిబ్బంది తీసుకువెళ్లారు.