ఏపీలో భారీ వర్షాల కారణంగా నేడు స్కూళ్లకు సెలవు

1070பார்த்தது
ఏపీలో భారీ వర్షాల కారణంగా నేడు స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని అన్ని స్కూళ్లకు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా ఇలాగే వర్షాలు కొన‌సాగితే.. మంగ‌ళ‌వారం కూడా స్కూళ్లకు సెల‌వు ఇవ్వ‌నున్నారు. ఆదేశాలు ఉల్లంఘించి స్కూల్స్ నడిపిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி