వ్యాపారం, దాతృత్వంలో 'రతన్‌ టాటా' శాశ్వత ముద్ర వేశారు: రాహుల్‌ గాంధీ

53பார்த்தது
వ్యాపారం, దాతృత్వంలో 'రతన్‌ టాటా' శాశ్వత ముద్ర వేశారు: రాహుల్‌ గాంధీ
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనను విజన్ కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్‌ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. రతన్‌ టాటా కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

தொடர்புடைய செய்தி