తరగతి గదిలో సెల్ఫోన్ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం సర్క్యూలర్ ను జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరచాలని ఆదేశించారు. తరగతి గదుల్లో కొందరు ఉపాధ్యాయులు సెల్ఫోన్ మాట్లాడుతున్నట్టు సమాచారం ఉందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీనిని నివారించడం కోసం సర్క్యూలర్ను జారీ చేసినట్టు చెప్పారు.