రైతుబజార్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

63பார்த்தது
రైతుబజార్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
సరూర్ నగర్ రైతుబజార్ ఆధునికీకరణకు కృషి చేస్తానని మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రైతుబజార్ ను గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సెక్రటరీ చిలుక నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. 1994-95 లో ఏర్పాటు చేసిన నిర్మాణం కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, షెడ్డు నిర్మాణాన్ని కొంచం ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி