నాలా పూడికతీత పనుల పరిశీలన

73பார்த்தது
నాలా పూడికతీత పనుల పరిశీలన
మురికి కాలువలు, నాలాలు పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలని గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమమహేశ్వర్రెడ్డి అన్నారు. డివిజన్లోని వీవీనగర్ శ్రీరామకృష్ణ శారదా విద్యాలయం వద్ద నాలా పూడికతీత పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వరదనీరు సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మురికి కాలువలో ఉన్న చెత్త, ప్లాస్టిక్ కవర్లు తొలగిస్తే ముంపు సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி