కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాయ్బరేలిలో పర్యటించారు. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ (కేరళ), రాయ్బరేలి (యూపీ) నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాయ్బరేలిలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. రాహుల్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. ప్రజలు పెద్దసంఖ్యలో చేరి రాహుల్తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు.