ప్రైవేట్‌ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

64பார்த்தது
ప్రైవేట్‌ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తోన్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌ రోడ్డు చంద్రగిరి విల్లాస్‌ కాలనీకి వెళ్లే దారి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టింది.

தொடர்புடைய செய்தி