అమెరికా టూర్‌లో జెలెన్‌స్కీతో ప్ర‌ధాని మోదీ భేటీ

58பார்த்தது
అమెరికా టూర్‌లో జెలెన్‌స్కీతో ప్ర‌ధాని మోదీ భేటీ
అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీని క‌లిశారు. ఈ సందర్భంగా ఇరువురు ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే మోదీ, జెలెన్‌స్కీ కలుసుకోవడం ఇది రెండో సారి. ఆగ‌స్టు 23వ తేదీన ఉక్రెయిన్‌లో మోదీ ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ర‌ష్యాతో జ‌రుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఆ స‌మ‌యంలో మోదీ హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி