ఏపీ ఫైబర్నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 24న ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఫైబర్ నెట్ ఎండీ దినేష్కుమార్ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రవీణ్ ఆదిత్యను ఏపీ ఫైబర్నెట్ ఎండీగా నియమించింది.